ETV Bharat / state

అర్హత ఉన్నా అందని అమ్మఒడి

author img

By

Published : Jan 25, 2021, 10:43 AM IST

అమ్మఒడి పథకానికి అర్హత ఉన్నా.. కొందరు చిన్నారులకు మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథక ఫలాలు మాత్రం అందడం లేదు. అలాంటి వారిలో తానూ ఉన్నానని.. లావణ్య అంటోంది. ఆమె.. కృష్ణా జిల్లా దొడ్డిపట్ల జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని. తనకు అర్హత ఉన్నా.. లబ్ధి మాత్రం దక్కడం లేదని ఆ చిన్నారి ఆవేదన చెందుతోంది.

Ammoodi did not receive the scheme despite being eligible
అర్హత ఉన్నా అందని అమ్మఒడి

అర్హత ఉన్నా అమ్మ ఒడి పథకానికి నోచుకోలేకపోయానని.. అధికారులు తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా కైకలూరు మండలం దొడ్డిపట్ల జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని చిన్నం లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని సీతనపల్లి గ్రామానికి చెందిన ఈ బాలిక తల్లిదండ్రులు నిరుపేదలు. దినసరి కూలికి వెళితే తప్ప పూట గడిచే స్థితిలో ఉన్నా.. కుమార్తెకు తమ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. గత ఏడాది రేషన్‌ కార్డు సాంకేతిక లోపంతో జారీ కాకపోవడంతో ప్రస్తుత ఏడాది అన్ని ధ్రువ పత్రాలు అందించారు.

మంజూరు పత్రంలో తొలి వరసలోనే పేరు నమోదైంది. విద్యార్థినికి 92 శాతం హాజరు కూడా ఉంది. అధికారులు మాత్రం హాజరు సరిపోలేదనే కారణం చూపుతూ అమ్మఒడి నగదు జమ చేయలేదు. సమస్య పరిష్కారం తమ పరిధిలో లేదని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పరిష్కారం లభించలేదంటున్నారు విద్యార్థిని తల్లి లలిత. ఉన్నతాధికారులు శ్రద్ధ చూపి పేదింటి విద్యాకుసుమానికి పథకం వర్తింపజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వైభవంగా మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.