ETV Bharat / state

ఆర్బీకే సిబ్బంది, మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు..గుడివాడలో రైతుల ఆందోళన

author img

By

Published : Nov 30, 2022, 5:00 PM IST

Agitation Of Grain Farmers In Gudivada: ధాన్యం పంటపై ఆంక్షలు ఎత్తివేసి.. మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతన్నలు ఆందోళన చేపట్టారు. అర్బీకే సిబ్బంది, మిల్లర్లు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి తెలుగు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు.

agitation of grain farmers
ధాన్యం రైతులు ఆందోళనలు

Agitation Of Grain Farmers In Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని ధాన్యం రైతులు ఆందోళనలు చేపట్టారు. ధాన్యం పంటపై ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతాంగం చేస్తున్న ఆందోళనలో తెలుగు రైతు సంఘం నాయకులు మద్దతుగా పాల్గొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు రోడ్డుపై భైఠాయించారు.

రైతుల ఆందోళనతో జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అర్.బీ.కే సిబ్బంది, మిల్లర్లు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని షరతులతో కావాలనే మిల్లర్లు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తెలుగు రైతు సంఘం నాయకులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.