కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి కంచికచర్ల మీదుగా తిరువూరుకు వెళ్తున్న బస్సు.. ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును అదుపు చేయటంతో పల్టీలు కొట్టకుండా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇవీ చదవండి..