ETV Bharat / state

Arrest: హత్య కేసులో ఎస్సై, సీఐలను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

author img

By

Published : Oct 15, 2022, 11:15 AM IST

Arrest
హత్య కేసులో ఎస్సై సీఐ అరెస్ట్

Arrest: కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన హత్య కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, సీఐలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే..?

Arrest: కృష్ణాజిల్లా పామర్రులో హత్య కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తోట్లవల్లూరు ఎస్సై, పమిడిముక్కల సీఐలను ఏసీబీ అరెస్టు చేశారు. పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సై అర్జున్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని అధికారులు... ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. వీరు ఇద్దరు సంచలనం సృష్టించిన తోట్లవల్లూరు ఐటీ ఉద్యోగి, హత్య కేసులో ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఇరువురు అధికారులు అరెస్టు కావడంతో పోలీసు వర్గాల్లో అలజడి నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.