రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం విజయవాడలో నిర్వహంచిన 3కే వాక్ కు భారీ స్పందన వచ్చింది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, ఎన్నారై మెడికల్ కాలేజ్, ఆంధ్ర లయోలా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్ ను ఎన్ ఆర్ ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఉపేంద్రనాథ్ నిమ్మగడ్డ, డాక్టర్ మణి అక్కినేని ప్రారంభించారు.క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయడం సులువని, మహిళలు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలని డాక్టర్ ఉపేంద్ర నాథ్ సూచించారు.
ఇదీ చదవండి: సాగుబడిలో పంతులమ్మ సిరుల పాఠాలు...!