ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Mar 10, 2021, 5:03 PM IST

రాష్ట్రంలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒక మరణం నమోదైంది. గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి మరో 93 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,064 కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాగా.... 48,973 కరోనా పరీక్షలు చేశారు.

రాష్ట్రంలో కొత్తగా 120 కరోనా కేసులు,ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 120 కరోనా కేసులు,ఒకరు మృతి


గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 120 మందికి కరోనా సోకింది. అత్యధికంగా చిత్తూరులో 35 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 17, కృష్ణాలో 25, గుంటూరులో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, నెల్లూరు 9, కడపలో10, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2 ,ప్రకాశం 2, అనంతపురంలో 4 , విజయనగరం 2 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు నమోదు కాలేదు. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 8 లక్షల 91 వేల 4కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1064 గా వైద్యాధికారులు తెలిపారు.

గడచిన 24 గంటల వ్యవధిలో 93మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 82 వేల 763కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల చిత్తూరులో ఒకరు మరణించారని అధికారులు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్​తో మృతి చెందిన వారి సంఖ్య 7 వేల 177 కి చేరింది.

ఇవీ చదవండి 'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.