ETV Bharat / state

పింఛను రద్దు చేసి ఏడాది అయ్యింది.. ఇంకా పునరుద్ధరించలేదు

author img

By

Published : Jan 4, 2023, 9:40 PM IST

pension
pension

Pensions Cancelled In AP: పేద కుటుంబానికి చెందిన తనకు ప్రభుత్వం సామాజిక పింఛను రద్దుచేసి ఏడాది కావస్తున్నా నేటికీ పునరుద్ధరించలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి సుబ్బలక్ష్మి అనే వితంతువు మంత్రి విశ్వరూప్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. వీరి సమస్యలను పరిష్కరించాలని మంత్రి విశ్వరూప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Pensions Cancelled In AP: పేద కుటుంబానికి చెందిన తనకు ప్రభుత్వం సామాజిక పింఛను రద్దుచేసి ఏడాది కావస్తున్నా నేటికీ పునరుద్ధరించలేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి సుబ్బలక్ష్మి అనే వితంతువు మంత్రి విశ్వరూప్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అమలాపురంలో నూతనంగా మంజూరైన వారికి సామాజిక పింఛన్లు మంత్రి విశ్వరూప చేతుల మీదుగా పంపిణీ చేశారు.

భర్త చనిపోగా.. తనకు పింఛను వచ్చేదని.. తన పేరు, కుమార్తె పేరు ఒకే రేషన్ కార్డులో ఉండడంతో పింఛను రద్దు చేశారని ఓ వృద్ధురాలు వాపోయింది. కుమార్తె భర్త కూడా చనిపోయాడని.. ఒకే రేషన్ కార్డుపై రెండు పెన్షన్లు ఇవ్వడం కుదరదని.. తన పింఛను రద్దుచేసి మంజూరు చేశారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. తన గోడును మంత్రి పినిపే విశ్వరూపు ఎదుట చెప్పుకొని కన్నీరుమున్నీరయింది. ఇలా మరికొంతమంది వృద్ధులు వితంతువులు కూడా తమ పింఛన్లు రద్దయ్యాయని.. పునరుద్ధరించాలని కోరారు. వీరి సమస్యలను పరిష్కరించాలని మంత్రి విశ్వరూప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

పింఛను రద్దు చేసి ఏడాది అయ్యింది.. ఇంకా పునరుద్ధరించలేదు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.