ETV Bharat / state

వీఆర్వో వేధిస్తున్నాడని.. యువతి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 29, 2021, 3:56 PM IST

young woman commits suicide
వీఆర్వో వేధిస్తున్నాడని యువతి ఆత్మహత్యాయత్నం

ఏడాది కాలంగా వీఆర్వో వేధిస్తున్నాడని.. సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మిరియాల గ్రామంలో జరిగింది.

గుంటూరు జిల్లా కరంపూడి మండలం మిరియాల గ్రామ సచివాలయ వీఆర్వోపై వేధింపుల కేసు నమోదైంది. ఏడాదిగా తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నట్లు సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్న యువతి పేర్కొంది.

వేధింపులు తాళలేక శనివారం యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయంపై కుటుంబీకులు తహసీల్దార్​ ప్రసాద్​కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వో వెంకటేష్​ను పోలీసులకు అప్పగించారు. సంఘటనపై వివరాలు సేకరించి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

ఇవీ చూడండి:

గంజాయి లిక్విడ్: 'విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.