ETV Bharat / state

Theft: బంగారం దుకాణంలో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ

author img

By

Published : Oct 28, 2021, 10:44 PM IST

గుంటూరు జిల్లా(Guntur district)వినుకొండ పట్టణంలోని ఓ జ్యూయలర్స్​లో రాత్రి చోరీ(Theft at a jewelery shop) జరిగింది. సుమారు 40 కిలోల వెండి, 1/4 కిలో బంగారు వస్తువులు, రూ.రెండు లక్షలు చోరీకి గురైనట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నరసరావుపేట డీఎస్పీ తెలిపారు.

Theft
Theft

గుంటూరు జిల్లా(Guntur district) వినుకొండ పట్టణంలోని రంగనాయకుల స్వామి దేవాలయం వద్దనున్న అనుష్క జ్యూయలర్స్​లో చోరీ(Theft at a jewelery shop) జరిగింది. సుమారు 40 కిలోల వెండి, 1/4 కిలో బంగారు ఆభరణాలు, రూ.రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ మాదిరిగానే రాత్రి షాపునకు తాళాలు వేశానని.. ఉదయం వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి షాప్​లో ఉన్న వెండి, బంగారం, కౌంటర్​లో ఉన్న రెండు లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర రావు(narasaraopeta dsp vijaya bhaskara rao) చెప్పారు. వ్యాపారులు రాత్రి సమయంలో షాపులకు తాళాలు వేసే సమయంలో నగదును, విలువైన వస్తువులను ఇళ్లకు తీసుకపోవాలని సూచించారు.

ఇదీ చదవండి

విశాఖలో దొంగతనాలకు పాల్పడిన పదిమంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.