ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపుపై బాపట్లలో తెదేపా నిరసన దీక్ష

author img

By

Published : May 22, 2020, 12:11 AM IST

పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని కోరతూ బాపట్లలో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ నరేంద్రవర్మ నిరసన దీక్ష చేపట్టారు. కరోనా కష్ట సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Tdp protests in bapatla
నిరసన దీక్ష చేస్తున్న తెదేపా నాయకులు

గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా నియోజకవర్గం ఇంఛార్జ్ నరేంద్రవర్మ నిరసన దీక్ష చేపట్టారు. తెదేపా పాలనలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లులు పెంచలేదని... ఇప్పుడు విద్యుత్ శ్లాబుల విధానంలో మార్పులు చేసి ప్రజల గుండెల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ఆనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత విద్యుత్ శ్లాబుల విధానమే కొనసాగించాలని కోరారు.

ఇదీ చూడండి:రంగనాయకమ్మపై కేసు విషయంలో సీఐడీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.