గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ను అత్యుత్తమ వసతులతో అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కావటి మనోహర నాయడు తెలిపారు. నగర కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియూఐ - ఏఎంఎల్) రూపొందించిన మార్కెట్ అభివృద్ధి ప్లాన్ పై చర్చించారు. పీవీకే నాయుడు మార్కెట్ గుంటూరు నగరం నడిబొడ్డున ఉందని.. అక్కడే పునర్నిర్మించే మార్కెట్ కాంప్లెక్స్ సకల సదుపాయాలతో, అధునాతన వసతులతో ఉండాలన్నారు.
వీలైనంత త్వరగా మార్కెట్ కాంప్లెక్స్ పనులు ప్రారభించి, నిర్దేశిత గడువులో పూర్తి చేయలని నిశ్చయంతో ఉన్నామన్నారు. నూతనంగా నిర్మించే మార్కెట్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నవారికి దుకాణాల కేటాయింపు చేస్తామని తెలిపారు. పార్కింగ్, మార్కెట్, కమర్షియల్ విభాగాలుగా నిర్మాణం చేయనున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: