ETV Bharat / state

విద్యార్థులు 'మత్తు పదార్థాలకు బానిస అవ్వొద్దు'

author img

By

Published : Mar 23, 2021, 6:54 PM IST

గుంటూరు జిల్లాలో పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస అవుతున్న ఘటనలపై... పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాలు సేవించడం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.

మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు పోలీసులు అవగాహన
మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు పోలీసులు అవగాహన

గుంటూరు జిల్లా మంగళగిరి డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఒక్కసారి మత్తుపదార్థాలకు అలవాటైతే జీవితం అక్కడితో ఆగిపోతోందని డీఎస్పీ దుర్గాప్రసాద్ చెప్పారు. తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు.

డ్రగ్స్​కు బానిసలైన విద్యార్థులు.. వాటిని సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. వాటికి ఈ స్థాయిలోనే అడ్డుకట్ట వేయాలని.. అందుకే మంగళగిరి, తాడేపల్లిలోని కళాశాలలు, పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాల కేసులో ఏ స్థాయి వాళ్లు ఉన్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. యువకుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.