ETV Bharat / state

'ముస్లింలను అణగదొక్కేందుకు వైకాపా యత్నిస్తోంది'

author img

By

Published : Sep 25, 2021, 7:49 PM IST

మాట్లాడుతున్న మైనార్టీ నాయకులు
మాట్లాడుతున్న మైనార్టీ నాయకులు

ముస్లింలను అణగదొక్కేందుకు వైకాపా యత్నిస్తోందని గుంటూరు జిల్లా దుగ్గిరాల తెదేపా ఎంపీపీ అభ్యర్థిని షేక్ జబీన్ బాబాయ్ షేక్ జలీల్ ఆరోపించారు. మంగళగిరి తెదేపా పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు.

ముస్లింలను అణగదొక్కేందుకు వైకాపా యత్నిస్తోందని గుంటూరు జిల్లా దుగ్గిరాల తెదేపా ఎంపీపీ అభ్యర్థిని షేక్ జబీన్ బాబాయ్ షేక్ జలీల్ ఆరోపించారు. మంగళగిరి తెదేపా పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు రాజ్యాధికారం రాకుండా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కుట్ర చేస్తున్నారని జలీల్ చెప్పారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే తమ కూతురు జబీన్కు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ముస్లింలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో అందరికి తెలుస్తోందన్నారు. ఈ చర్యలను ముస్లింలంతా తిప్పికొట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

'భారత్​లో సంస్కరణలతో ప్రపంచం రూపాంతరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.