ETV Bharat / state

'రోగుల సహాయకులకూ త్వరలో 2 పూటలా ఉచిత భోజనం'

author img

By

Published : Jan 26, 2021, 11:24 AM IST

Minister Sriranganatharaju
మంత్రి శ్రీరంగనాథరాజు

గుంటూరు సర్వజనాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. మాతా, శిశు భవనాన్ని త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గుంటూరు సర్వజనాసుపత్రిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

దీని కోసం అత్యంత ఆధునిక పద్ధతులతో భోజనశాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి రెండో వారం నాటికి పనులన్నీ పూర్తిచేసి భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మాతా,శిశు భవన నిర్మాణం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఒంగోలు ఎద్దులు కనుమరుగవుతున్నాయి: మంత్రి శ్రీ రంగనాధరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.