ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్యం అందిస్తుంటే.. అదే వైద్యుల పైన దాడులు చేయటాన్ని ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి నంద కిషోర్ ఖండించారు. దాడులకు నిరసనగా గుంటూరు మెడికల్ క్లబ్ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన చేశారు.
దేశంలో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు పెరిగిపోయాయని నంద కిషోర్ అన్నారు. దాడులకు వ్యతిరేకంగా సేవ్ సేవియర్ పేరుతో నిరసన తెలియజేసినట్లు చెప్పారు. దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని ప్రధాని మోడికి విజ్ఞప్తి చేశామన్నారు. కరోనా సయమంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే నిరసన తెలియజేస్తున్నామన్నారు. అలోపతి వైద్యులు, చికిత్స విధానంపై రాందేవ్ బాబా చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్లు, ఎన్వోసిలు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి దేశ వ్యాప్తంగా జరగుతున్న దాడులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలన్నారు.
ఇదీ చదవండి