ETV Bharat / state

ఏపీ హైకోర్టుకు రెండేళ్లు పూర్తి.. న్యాయవాదుల ప్లకార్డుల ప్రదర్శన

author img

By

Published : Dec 31, 2020, 4:11 PM IST

lawyers celebrations for two years celebrations of  ap high court
lawyers celebrations for two years celebrations of ap high court

ఏపీ హైకోర్టు అమరావతికి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు సాధన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శించారు.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అమరావతికి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ హైకోర్టు సాధన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్లకార్డులు చేపట్టారు. ఈ రెండేళ్ల కాలంలో హైకోర్టు ఎన్నో సంచలమైన తీర్పులను వెలువరించిందని న్యాయవాదులు చెప్పారు. రెండేళ్ల సమయం చాలా తొందరగా గడిచిందని న్యాయవాదులు అన్నారు. హైకోర్టు సాధన కోసం చేసిన పోరాటాలను న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

గురువారం సాయంత్రం పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్​కు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏపీ హైకోర్టుకు రెండేళ్లు పూర్తి.. న్యాయవాదుల ప్లకార్డుల ప్రదర్శన

ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.