ETV Bharat / state

సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్​పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

author img

By

Published : Oct 20, 2022, 10:41 AM IST

High Court lawyer Lakshminarayana: సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్​పై కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ దిల్లీలో ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో న్యాయవాది కోరారు.

High Court lawyer Lakshminarayana
హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ

High Court lawyer Lakshminarayana: సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్​పై కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చు కునేందుకు క్రిమినల్ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్ట్, కస్టడీలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ ఏడీజీ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కేంద్ర హోంశాఖ, డీవోపీటీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆన్ పిటిషన్లు, ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్​లకు ఫిర్యాదు చేశారు. పీవీ సునీల్ కుమార్​పై చర్యలు తీసుకోవాలని పిటిషన్​లో న్యాయవాది కోరారు.

హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.