ETV Bharat / state

కోర్టు ధిక్కరణ కేసు.. హైకోర్టుకు హాజరైన మాజీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి

author img

By

Published : Apr 1, 2023, 7:37 AM IST

APPSC Chairman Gautam Sawang
APPSC Chairman Gautam Sawang

APPSC Chairman Gautam Sawang: ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పదోన్నతి కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. అధికారులు వ్యవహరించలేదని.. కోర్టు ధిక్కరణ కేసులో పూర్వ డీజీపీ.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్, హోం శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు వ్యాజ్యంపై విచారణ జరిపారు.

APPSC Chairman Gautam Sawang: కోర్టు ధిక్కరణ కేసులో పూర్వ డీజీపీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌, హోంశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు వ్యాజ్యంపై విచారణ జరిపారు. ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పదోన్నతి కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించలేదని ఆక్షేపించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సానుకూల దృక్పథంతో అర్ధం చేసుకోలేదన్నారు. అధికారుల తరఫు న్యాయవాది కిశోర్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఏసీఆర్‌(వార్షిక రహస్య నివేదిక)ను పరిగణనలోకి తీసుకొని పదోన్నతి కల్పించలేదన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేశామన్నారు. దానిపై తిరుగు సమాధానం(రిప్లై) వేయాలని పిటిషనర్‌కు సూచించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేశారు. అధికారులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.

విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ రాజశేఖర్‌కు 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబర్‌ 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంలో రాజశేఖర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం విచారణకు పూర్వ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హోంశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ హాజరు అయ్యారు. ఇదే కేసులో గత విచారణకు డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హాజరు అయిన విషయం తెలిసిందే.

డీజీపీ నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా.. గత ఎన్నికల సమయానికి విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ని, వైసీపీ అధికారంలోకి వచ్చాక డీజీపీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వం పట్ల తన విధేయతను ప్రకటించేందుకు ఏ అవకాశాన్నీ విడిచి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన హయాంలోనే రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల దౌర్జన్యం, అక్రమంగా కేసులు పెట్టడం, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, టీడీపీ నాయకులపై కేసులు, అర్ధరాత్రి అరెస్టుల వంటి పలు ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయినా డీజీపీ కుర్చీలో ఉన్న చివరి క్షణం వరకూ ప్రభుత్వం ఏం చెబితే అదే చేశారన్న అభిప్రాయం ఉంది. అలాంటి ఆయనను అకస్మాత్తుగా.. డీజీపీ పోస్టు నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభత్వం నియమించింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో.. సర్వీసులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ పోస్టులో చేరాలంటే సర్వీసుకు రాజీనామా చేయాలి. సవాంగ్‌ ఐపీఎస్‌కి రాజీనామా చేశాకే.. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సవాంగ్‌ పదవీ విరమణకు 2023 జులై వరకు గడువు ఉంది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఆరేళ్లు గానీ, 62 ఏళ్ల వయసు వరకు గానీ కొనసాగవచ్చు. ఐపీఎస్‌కి రాజీనామా ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పోస్టులో ఆయన మూడున్నరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.