ETV Bharat / state

రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్​కే దక్కుతుంది: ఆలపాటి

author img

By

Published : Jun 2, 2021, 3:10 PM IST

alapati
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. రెండేళ్ల పాలన గురించి పుస్తకాలు ముద్రించుకోవడం సిగ్గు చేటన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రెండేళ్ల పాలన గురించి వైకాపా పుస్తకాలు ముద్రించుకోవడం సిగ్గు చేటన్నారు. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని... సంక్షేమం సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. తనపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేయించుకుని.. సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'నాడు అభివృద్ధికి నిలయమైతే.. నేడు అప్పులు, అరాచకాలకు కేరాఫ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.