ETV Bharat / state

ప్రయాణిస్తున్న కారులో మంటలు... తప్పిన ప్రాణాపాయం

author img

By

Published : Apr 29, 2021, 6:34 PM IST

fire in moving car at ganapavaram guntur district
ప్రయాణిస్తున్న కారులో మంటలు

గుంటూరు జిల్లా గణపవరం వద్ద ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చెన్నై నుంచి తెనాలి వస్తున్న కారు.... సీఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందికి దిగిపోవటంతో తృటిలో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా... రెండు ల్యాప్ టాప్‌లు, 15 వేల రూపాయలు, దుస్తులు బూడిదైయ్యాయి.

ప్రయాణిస్తున్న కారులో మంటలు

ఇదీచదవండి.

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.