ETV Bharat / state

ఏపీ బార్ కౌన్సిల్లో 15 మంది నకిలీ వకీల్​సాబులు.. ఇద్దరు అరెస్టు

author img

By

Published : Jan 30, 2023, 10:24 AM IST

Updated : Jan 30, 2023, 11:20 AM IST

Fake Lawyers: ఏపీ బార్ కౌన్సిల్​లో.. నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బార్ కౌన్సిల్ తీవ్రంగా మండిపడింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి బి.పద్మలత తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఇద్దర్ని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

Fake Lawyers Arrest
నకిలీ లాయర్ల అరెస్ట్

Fake Lawyers: గుంటూరు జిల్లాలో పలువురు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని ఏపీ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించింది.

నకిలీ లాయర్ల అరెస్ట్: నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్లో పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఇద్దర్ని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఒకరిని, ఆదివారం మరొకరిని అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 15 మంది నకిలీలను బార్ కౌన్సిల్ గుర్తించగా వారిలో ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 11న తుళ్లూరు పోలీసులకు బార్ కౌన్సిల్ కార్యదర్శి బి. పద్మలత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఇద్దర్ని అరెస్టు చేశామని మిగిలిన వారు పోన్లు స్విచాఫ్ చేసుకుని పరారీలో ఉన్నారని వారినీ త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు. వీరి అరెస్టు విషయాన్ని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టుకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.

క్రైం నంబరు 7/2023లో ఐపీసీ సెక్షన్లు 420, 467, 468, 471, 120(బి), రెడ్‌విత్‌ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతకాయల సీఎస్‌ఎన్‌ మూర్తి (తుని), డి.చాముండేశ్వరి(తెనాలి), సీడీ పురుషోత్తం(అనంతపురం), శ్రీమతి డి.రత్నకుమార్‌(ఏపీ హైకోర్టు ప్రాక్టీసు) నిక్కి నాగేశ్వరరావు(సత్తెనపల్లి), మాచర్ల వెంకటేశ్వరరావు(సత్తెనపల్లి), కొత్తూరి శ్రీనివాస్‌వరప్రసాద్‌(కాకినాడ)లను నిందితులుగా పేర్కొన్నారు.

ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వీరి విద్యార్హత ధ్రువపత్రాలు సరైనవా కాదా? అని నిర్ధారించాలని సంబంధిత కళాశాలలు, యూనివర్సిటీలకు పంపగా.. వీరు సమర్పించిన ధ్రువపత్రాలు తప్పుడు, ఫోర్జరీ చేసినవనిగా తేలాయని బార్‌ కౌన్సిల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే తరహా వ్యవహారంపై క్రైం నంబరు 8/2023 పోలీసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 30, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.