ETV Bharat / state

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ అదుపులో మరో ఇద్దరు.. వారి కస్టడీపై..

author img

By

Published : Nov 14, 2022, 2:42 PM IST

Delhi Liquor Scam Arrests : దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐల సంయుక్త దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

Delhi Liquor Scam Arrests
Delhi Liquor Scam Arrests

Delhi Liquor Scam Arrests : దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ సంయుక్త దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కస్టడీకి కూడా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Delhi Liquor Scam Latest Arrests : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అభిషేక్, విజయ్ నాయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి దాకా సీబీఐ అదుపులో ఉన్న వీరిని కోర్టు ఉత్తర్వుల సమయంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, లిక్కర్ వ్యాపారి బినోయ్‌బాబులు ఈడీ కస్టడీలో ఉన్నారు. శరత్‌, బినోయ్‌బాబు ఇచ్చిన వివరాలతో అభిషేక్, విజయ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దర్యాప్తులో భాగంగా అభిషేక్, విజయ్‌లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు ఇవాళ మధ్యాహ్నం ఇరువురి వాదనలు విననుంది. ఇప్పటికే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న దినేష్ అరోరా వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రత్యేక కోర్టు అతడి వాంగ్మూలమంతా వీడియో రికార్డు చేస్తోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.