ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు.. ముగ్గురికి పాజిటివ్

author img

By

Published : Oct 21, 2020, 11:22 PM IST

covid-19 tests at zphs of  Chilakaluripet mandal guntur district
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు.. ముగ్గురికి పాజిటివ్

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కావూరు, కోమటినేనివారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కావూరు, కోమటినేనివారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. 300 మందికి టెస్టులు చేయగా.. ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 12 మంది గ్రామస్థులకు కూడా వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.