నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కావూరు, కోమటినేనివారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. 300 మందికి టెస్టులు చేయగా.. ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 12 మంది గ్రామస్థులకు కూడా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: