ETV Bharat / state

'కరోనా వైరస్​ పట్ల భయాందోళనలు అవసరం లేదు'

author img

By

Published : Jul 12, 2020, 4:42 PM IST

కరోనా అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్​లో ఉన్న ఆయన.. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు.

ycp mla
ycp mla

ఎమ్మెల్యే కిలారి రోశయ్య సందేశం

కరోనా వైరస్ పట్ల ఎవరూ ఆందోళనకు గురికానవసరం లేదని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య తెలిపారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు. కరోనా అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని... వైరస్ సోకిన వారి పట్ల వివక్ష మానుకోవాలని సూచించారు.

వైరస్ బాధితుల్లో 98 శాతం మంది కోలుకుంటున్నారని... ప్రత్యేకమైన సమస్యలున్న 2 శాతం మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య చికిత్సలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రోశయ్య అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

చిత్తూరు జిల్లాలో అమానవీయం..ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.