ETV Bharat / state

Corona: మేడి కొండూరు ప్రభుత్వ పాఠశాలలో.. కరోనా కలకలం!

author img

By

Published : Feb 11, 2022, 10:34 PM IST

మేడి కొండూరు ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం
మేడి కొండూరు ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం

గుంటూరు జిల్లా మేడి కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు మిగిలిన విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేయించి.. తరగతి గదులను శానిటైజ్ చేయించారు.

గుంటూరు జిల్లా మేడి కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఉద్యాధ్యాయులు పాఠశాలలోని 8,9,10 తరగతులకు చెందిన 400 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తరగతి గదులను శానిటైజ్ చేయించారు.

AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,166 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,632 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 32,413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఐదుగురు మరణించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 58వేల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.