ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

author img

By

Published : Apr 6, 2021, 12:05 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల నుంచి పెదనందిపాడు వెళ్లే రహదారిలో.. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. కాకుమాను పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న దామర్ల రామ్మోహన్ మృతిచెందారు.

accident
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

గుంటూరు జిల్లా బాపట్ల నుంచి పెదనందిపాడు వెళ్లే రహదారిలో.. ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కానిస్టేబుల్ దామర్ల రామ్మోహన్ మృతిచెందాడు. బాపట్లలోని రైలుపేటకు చెందిన రామ్మోహన్.. కాకుమాను పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

పోలీస్ స్టేషన్​లో రాత్రి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై.. కాకుమాను వెళ్తుండగా, జమ్ములపాలెం ఎస్సీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న కానిస్టేబుల్​ను గుర్తించిన స్థానికులు.. చికిత్స నిమిత్తం బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం.. వైద్యులు గుంటూరు ఆసుపత్రికి పంపించారు. గుంటూరులో చికిత్స పొందుతు కానిస్టేబుల్ మృతి చెందారు.

ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.