ETV Bharat / state

వైకాపా- తెదేపా శ్రేణుల మధ్య తోపులాట... పరిస్థితి ఉద్రిక్తం

author img

By

Published : Mar 24, 2022, 8:16 PM IST

Conflict between TDP and YSRCP at Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మూర్తి కొండయ్య వీధిలో కూల్చివేసిన భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా నేతలను వైకాపా శ్రేణులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.

Conflict between tdp and ysrcp at Tenali
తెనాలిలో వైకాపా తెదేపా శ్రేణుల మధ్య గొడవ

గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్యం వివాదం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని మూర్తి కొండయ్య వీధిలో నూనె కృష్ణమార్తి అనే వ్యాపారి దుకాణాన్ని మున్సిపల్ అధికారులు రెండు రోజుల క్రితం తొలగించారు. అయితే.. వైకాపా నేతల ఒత్తిడితో తమ భవనాన్ని కూల్చివేశారని కృష్ణమూర్తి ఆరోపించారు.

ఈ క్రమంలో కృష్ణమూర్తి దుకాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందాన్ని వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. కూల్చివేసిన దుకాణం వద్దకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎప్పుడూ ఎం జరుగుతుందో అని స్థానికులు భయంతో వనికిపోతున్నారు.

ఇదీ చదవండి: సలసల మండుతున్న వంట నూనె ధరలు... అల్లాడుతున్న సామాన్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.