ETV Bharat / state

స్థానిక సమరం: రెండో దశ పోలింగ్​ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

author img

By

Published : Feb 11, 2021, 9:25 PM IST

collector
రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

నరసరావుపేట నియోజకవర్గంలోని రెండో దశ పోలింగ్ జరిగే కేంద్రాలను కలెక్టర్ వివేక్ యాదవ్, రూరల్​ ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, పోలీసులతో సమావేశమై రెండో దశ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

నరసరావుపేట నియోజకవర్గంలో.. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పర్యటించారు. రెండోదశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లోని పలు పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. మొదటగా నరసరావుపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, పోలీసులతో సమావేశమై రెండో దశలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

ఇదీ చదవండి:

నోటా మార్చిన తలరాత.. రికార్డు స్థాయిలో చెల్లని ఓట్లు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.