ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Oct 31, 2022, 5:00 PM IST

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • ప్రభుత్వం చేతిలో సీఐడీ కీలుబొమ్మగా మారింది: గౌతు శిరీష
    gouthu sireesha: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఇటీవల సీఐడీ కేసు ఎదుర్కొన్న రావిపాటి సాయి కృష్ణను పరామర్శించారు. అనంతరం సీఐడీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి: సీపీఐ నేత రామకృష్ణ
    CPI RAMAKRISHNA COMMENTS : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదురుగా సీపీఐ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • 'భారతీయ రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడతాం'
    NFIR GENERAL SECRETARY IN TIRUMALA : భారతీయ రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడతామని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాఠశాలల్లోనూ దారుణాలు.. విద్యార్థినిపై లైబ్రేరియన్​ లైంగిక దాడి
    Rape: పాఠశాలలో పుస్తకాలు ఇచ్చి పిల్లల్లో జ్ఞానాన్ని పెంపోదించాల్సిన లైబ్రేరియన్​ దారుణానికి ఒడి కట్టాడు. తాను పని చేస్తున్న పాఠశాలలో 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పిల్లలకు జ్ఞానాన్ని పంచాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పలువురంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నావిక స్థావరం ప్రాజెక్టు దగ్గర 8 గ్రామాల నిర్వాసితుల ధర్నా
    Expatriates Protest: అనకాపల్లి జిల్లా నావికా స్థావరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు ధర్నాకు దిగారు. డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ధర్నాలో ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు. నేవీ ప్రాజెక్టులోకి ఎలాంటి వాహనాలూ వెళ్లకుండా రహదారిపై నిలిచిపోయాయి. భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 106+ ఏజ్​లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్​లో రెడ్​ కార్పెట్​ వెల్​కమ్​
    హిమాచల్ ​ప్రదేశ్​కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్​ నేగి.. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం కల్పించినా.. నేగి నిరాకరించారు. తాను స్వయంగా పోలింగ్​ బూత్​కు వెళ్లే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. పోలింగ్​ కేంద్రంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జ్యోతిషుడు చెప్పాడని ప్రియుడ్ని చంపిన కేసులో ట్విస్ట్.. స్టేషన్​లోనే విషం తాగిన నిందితురాలు
    కేరళలో తన ప్రియుడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీస్​స్టేషన్​ ఆవరణంలోనే విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ల్యాప్స్‌ అయిన పాలసీలతో మోసాలు.. మీకు కూడా ఈ అనుభవం ఎదురైందా?
    ల్యాప్స్‌(రద్దు) అయిన పాలసీలు కలిగిన పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగ్లాదేశ్​తో మ్యాచ్​.. దినేశ్ కార్తీక్​ వర్సెస్​ పంత్​.. ఆడేది ఎవరో?
    టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో గాయపడిన దినేశ్ కార్తీక్​.. బంగ్లాదేశ్​తో జరగబోయే మ్యాచ్​కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అతడి స్థానంలో పంత్ ఆడొచ్చని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. ఏం అన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిట్​ డైరెక్టర్​తో కమల్​ కొత్త మూవీ?.. ఫ్యాన్స్​కు 'యాక్షన్​' బొనాంజా!
    'విక్రమ్' సినిమాతో ఘన విజయం అందుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్​. ఆ జోష్​తో ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో హిట్​ దర్శకుడికి కమల్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.