ETV Bharat / state

'మాకూ వర్క్​ ఫ్రం​ హోమ్​ అవకాశం కల్పించండి'

author img

By

Published : Mar 20, 2020, 9:18 PM IST

ap secratariat
ap secratariat

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమకు ఇంటి నుంచే పనిచేసే(వర్క్​ ఫ్రం హోమ్) అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. అందరికీ ఇవ్వడం కుదరకపోతే కనీసం మహిళా ఉద్యోగులకైనా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

మీడియాతో ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 31 వరకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని... ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. కరోనా ప్రభావం ఉన్నందున వర్క్ ఫ్రం హోమ్ ప్రతిపాదనను పరిశీలించాలని విజ్ఙప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంతా ఆన్​లైన్​లోనే జరుగుతోందని ఐకాస బాధ్యులు వివరించారు. కరోనా ప్రభావం ఎక్కువున్న హైదరాబాద్​కు ఏపీలో కొందరు ఉద్యోగులు ఇప్పటికీ వారాంతాల్లో వెళ్లి వస్తుంటారని గుర్తుచేశారు. ఉద్యోగులందరికీ వర్క్​ ఫ్రం హోమ్ అమలు సాధ్యం కాకుంటే మహిళా ఉద్యోగులకైనా సదుపాయం కల్పించాలని కోరారు.

ప్రధాని మోదీ కూడా వీలున్నంత వరకు వర్క్ ఫ్రం హోమ్​కు పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున... వర్క్ ఫ్రం హోమ్ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఐకాస కోరింది. కరోనా ప్రభావంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సహా... ప్రభుత్వ పథకాల అమల్లో సమర్ధవంతంగా సేవలందిస్తామని ఉద్యోగులు చెప్పారు.

ఇదీ చదవండి:లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.