ETV Bharat / state

ఈ నెల 19న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

author img

By

Published : Aug 14, 2020, 1:59 PM IST

Updated : Aug 14, 2020, 4:24 PM IST

ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దుకు ఇటీవల గవర్నర్​ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

ap-cabinet-meeting-to-be-held-on-19th-of-this-month
ఈ నెల 19న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్​లో ఆ రోజు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఆగస్టు 17 సాయంత్రానికల్లా ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు చెందిన ప్రతిపాదనల్ని పంపాల్సిందిగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

మూడు రాజధానుల దిశగా తీసుకునే చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలనున్నాయి. మరోవైపు సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ ద్వారా ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి

మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

Last Updated : Aug 14, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.