ETV Bharat / state

పాదయాత్రకు అడ్డంకులు.. నేడు హైకోర్టును ఆశ్రయించనున్న రైతులు

author img

By

Published : Oct 27, 2022, 8:52 AM IST

AMARAVATI FARMERS PADAYATRA
AMARAVATI FARMERS PADAYATRA

AMARAVATI FARMERS PADAYATRA : రాజధాని రైతుల మహాపాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తూ.. మహిళలపై దాడులకు తెగబడుతున్నారంటూ.. ఐకాస నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నో పాదయాత్రలకు లేని నిబంధనలు తమ పట్లే విధించడంపై వెసులుబాటు కోరనున్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేవారు.. రైతులకు మద్దతుగా నడవకూడదనే నిబంధన.. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమనేదానిపై అప్పీల్‌కు వెళ్లనున్నారు.

పాదయాత్రకు అడ్డంకులు.. నేడు హైకోర్టును ఆశ్రయించనున్న రైతులు

AMARAVATI FARMERS PADAYATRA : రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రకు ఎదురవుతున్న అడ్డంకులపై రాజధాని రైతులు ఇవాళ.. హైకోర్టును ఆశ్రయించనున్నారు. సెలవుల అనంతరం నేడు హైకోర్టు తిరిగి ప్రారంభం కానుండటంతో.. పాదయాత్రకు అడ్డంకులపై కోర్టుకు నివేదించనున్నారు. పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా పాదయాత్రను ఈ నెల 29వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించే అవకాశాలను ఐకాస నేతలు, రైతులు పరిశీలిస్తున్నారు.

పాదయాత్ర 41వ రోజున రామచంద్రాపురంలో యాత్ర ప్రారంభయ్యే సమయానికి పోలీసులు.. రైతులు బస చేసిన కల్యాణ మండపాన్ని చుట్టుముట్టారు. అంతకు ముందు రోజు పసలపూడిలో జరిగిన దాడిలో పలువురు మహిళళు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలు సంఘీభావం తెలిపేందుకు వీల్లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున.. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్నను.. రైతులు న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. ఏకైక రాజధానిగా అమరావతికే ప్రజామద్దతు కోసమే.. అరసవల్లి వరకు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకున్నామని.. స్పష్టం చేయనున్నారు.

రైతుల మహాపాదయాత్ర అరసవల్లి వద్ద నవంబర్‌ 11న ముగియాల్సి ఉండగా.. అడ్డంకులు, వర్షాలు, ఇతర సమస్యల దృష్ట్యా.. విరామం ప్రకటించిన 41వ రోజు నాటికే.. అనుకున్న షెడ్యూల్‌కు 5 రోజులు వెనుకబడ్డారు. తాత్కాలిక విరామం కారణంగా.. మరో వారం రోజులు కలుపుకుంటే.. మొత్తంగా 12 రోజులు ఆలస్యమయింది. దీంతో తొలుతు అనుకున్న 60 రోజుల పాదయాత్ర కాస్తా.. ఇప్పుడు 75 రోజుల వరకూ కొనసాగనుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించి తీరతామని.. రైతులు స్పష్టం చేస్తున్నారు.

నవంబర్‌ 11 వరకూ పాదయాత్ర చేసుకునేలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపైనా వెసులుబాటు కోరనున్నారు. పసలపూడిలో మహిళలపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయకపోగా.. ఎదురు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రైతులు.. అవసరమైతే ప్రైవేటు కేసులు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

పాదయాత్రకు వస్తున్న స్పందన దృష్ట్యా.. తొలుత నిర్ణయించిన 600 మంది కన్నా ఎక్కువ మంది యాత్రలో పాల్గొనేలా.. అవకాశం కల్పించాలని రైతులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. తొలుత ప్రకటించిన జాబితాలోని 600 మందిలో.. ఎవరికైనా సమస్యలు తలెత్తితే.. వారి బదులు వారి కుటుంబసభ్యులు లేదా పాదయాత్ర చేయాలనుకుంటున్న ఇతర రైతులకు అనుమతి కల్పించాలని నివేదించనున్నారు. మొత్తంగా 2 వేల మందికి అనుమతి కల్పిస్తే.. వారిలో రోజూ 600 మంది పాదయాత్రలో పాల్గొనేలా తాము సమన్వయం చేసుకుంటామనే ప్రతిపాదనను.. న్యాయస్థానం ముందు రైతులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.