ETV Bharat / state

75 వసంతాల విద్యాలయం.. పూర్వ విద్యార్థుల ప్రదర్శన

author img

By

Published : Apr 2, 2021, 1:51 PM IST

75 years completed to zp school in kakamanu..
పూర్వ విద్యార్థులు ప్రదర్శన

గుంటూరు జిల్లా కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాలకు 75 వసంతాలు పూర్తైన సందర్భంగా.. మే నెల 1, 2 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు జరపనున్నారు. గురువారం పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు.

75 వసంతాల విద్యాలయం.. పూర్వ విద్యార్థులు ప్రదర్శన

గుంటూరు జిల్లా కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాల స్థాపించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా.. గురువారం పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. మే నెల 1, 2 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు జరిపేందుకు నిర్ణయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు.

ఈ పాఠశాల నుంచి 75 ఏళ్లలో 5500 మంది విద్యార్థులకుపైగా చుదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలను అభివృద్ధి చేసి.. భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా ఉండేలా చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: ఉపపోరు: సమీపిస్తున్న పోలింగ్... ప్రచారానికి పదును..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.