గుంటూరు జిల్లా కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాల స్థాపించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా.. గురువారం పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. మే నెల 1, 2 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు జరిపేందుకు నిర్ణయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ పాఠశాల నుంచి 75 ఏళ్లలో 5500 మంది విద్యార్థులకుపైగా చుదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలను అభివృద్ధి చేసి.. భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా ఉండేలా చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఉపపోరు: సమీపిస్తున్న పోలింగ్... ప్రచారానికి పదును..!