ETV Bharat / state

రాష్ట్రంలో 111కు కరోనా కేసులు... బాధితుల్లో అత్యధికులకు దిల్లీ లింకు

author img

By

Published : Apr 1, 2020, 11:09 PM IST

Updated : Apr 1, 2020, 11:29 PM IST

రాష్ట్రంలో కరోనా అలజడి స్పష్టిస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం 7 తరువాత కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఏపీలో వైరస్ పీడితుల సంఖ్య 111కు చేరింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

111 corona positive cases reported in andhra pradesh
111 corona positive cases reported in andhra pradesh

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7గంటల తర్వాత కొత్తగా 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర నోడల్​ అధికారి విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 11 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. కొత్తగా అచ్చంపేట, క్రోసూరు మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. నమోదైన పాజిటివ్ కేసులన్నీ దిల్లీకి వెళ్లివచ్చిన వారివేనని గుర్తించారు. దీంతో గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితులు వారంరోజుల్లో ఎవరెవరిని కలిశారో అధికారులు గుర్తిస్తున్నారు. బాధితులు కలిసిన వారందరినీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాకరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు20
కడప15
కృష్ణా15
ప్రకాశం15
పశ్చిమగోదావరి14
విశాఖపట్నం11
తూర్పుగోదావరి9
చిత్తూరు6
నెల్లూరు3
కర్నూలు1
అనంతపురం2
మొత్తం111

ఇదీ చదవండి: కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడింది: సీఎం జగన్

Last Updated : Apr 1, 2020, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.