ETV Bharat / state

పరిహారం అందేవరకూ గ్రామాలు ఖాళీ చేయం: పోలవరం నిర్వాసితులు

author img

By

Published : Apr 6, 2023, 8:05 AM IST

Updated : Apr 6, 2023, 1:37 PM IST

POLAVARAM VICTIMS ON COMPENSATION : నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు స్పష్టం చేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతే పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరుతూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ROUND TABLE MEETING ON POLAVARAM
ROUND TABLE MEETING ON POLAVARAM

పరిహారం అందేవరకూ గ్రామాలు ఖాళీ చేయం

POLAVARAM VICTIMS ON COMPENSATION : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంటూరి లెక్కల పేరుతో నష్టపరిహారం, పునరావాసం విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కాలనీల్లో ‌మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు. నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్వాసితులు గొంతెత్తారు.

కాంటూరి లెక్కలతో సంబంధం లేకుండా.. పరిహారం చెల్లించాలి: కాంటూరి లెక్కల పేరుతో ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురవుతున్న కొన్ని గ్రామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్నవారే లేరని వాపోయారు. రెండు మూడు నెలలు కొండలపై పరదాల్లో ఉండి, తాగునీటికి, ఆహారానికి సైతం అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. గిరిజనుల సాగులో ఉన్న అన్నిరకాల భూములకు భూమికి భూమి, పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 1986, 2022 వరద ముంపు ఆధారంగా రీసర్వే చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 10.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు.

ROUND TABLE MEETING ON POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని వివిధ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంవత్సరాలు గడుస్తున్న బాధితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్టపరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రానున్న రెండు, మూడు నెలల్లో ఉద్యమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , మాజీ మంత్రులు వడ్డే శోభనాధ్రిశ్వరరావు , దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి బాధితులు సమావేశంలో పాల్గొని తాము పడుతున్న ఇబ్బందులను ఎకరువు పెట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 6, 2023, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.