ETV Bharat / state

24 గంటల పాటు యువతి స్పీచ్​.. తెలుగు బుక్‌ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

author img

By

Published : Dec 12, 2022, 5:51 PM IST

young woman got a place in Telugu Book of Records
young woman got a place in Telugu Book of Records

young woman got a place in Telugu Book of Records: సూర్యాపేటకు చెందిన ప్రియాంక అనే యువతి 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్‌ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. క్లీనికల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగం చేస్తున్న ఈ యువతి హనుమకొండలోని 'సన్​రెజ్‌ టూ సన్‌రైజ్‌' అనే ప్రసంగాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకుంది.

Young Woman got a place in Telugu Book of Records: తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఓ యువతి.. హనుమకొండలో 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్ ఆఫ్‌ రికార్డుకు ఎక్కింది. ప్రియాంక అనే యువతి సూర్యాపేట నగరంలోని వాగ్ధేవి కళాశాలలో బీఫార్మసీ చదివి క్లినికల్‌ రీసెర్చ్​లో ఫార్మసిస్ట్​గా ఉద్యోగం చేస్తోంది. తెలుగు బుక్ ఆఫ్​ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​... ఇలా వరల్డ్‌ రికార్డు కోసం ప్రియాంక హనుమకొండలో 24 గంటల నిరంతర స్పీచ్ 'సన్‌ రైజ్ టు సన్ రైజ్' ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ప్రియాంక.. సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసంగించింది.

క్లినికల్‌ రీసెర్చ్, డాటా మేనేజ్​మెంట్​పై 24 గంటలు నిర్విరామంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ అడ్వైజర్ టీవీ ఆశోక్ పాల్గొని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేయడం పట్ల తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు ఎక్కిందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయినందుకు ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా గిన్నీస్ బుక్​లో పేరు సంపాదించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

24 గంటల పాటు యువతి స్పీచ్​.. తెలుగు బుక్‌ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు కైవసం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.