Rice Millers Association: రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వీరభద్రారెడ్డి

author img

By

Published : Oct 11, 2021, 8:27 AM IST

veerabhadra reddy
veerabhadra reddy ()

రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి(Rice Millers Association state president) గా ద్వారంపూరి వీరభద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడితో పాటు కార్యవర్గ ప్రతినిధులను ఎన్నుకున్నారు.

ఏపీ రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి(Rice Millers Association state president) గా తూర్పుగోదావరి జిల్లా(east godavari district) కాకినాడకు చెందిన ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమితులవడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కార్యవర్గ ప్రతినిధులను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం), కోశాధికారిగా కోటేశ్వరరావు (నెల్లూరు), ఐదుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు సంయుక్త కార్యదర్శులతో పాటు ఇద్దరు కార్యనిర్వాహక కమిటీసభ్యులను ఎన్నుకున్నారు.

ఇదీ చదవండి: నేడు తిరుమలకు సీఎం జగన్​.. స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.