ETV Bharat / state

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి అధ్యయనోత్సవాలు

author img

By

Published : Apr 9, 2021, 10:20 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు.

Vadapalli Venkateswara Swami
వాడపల్లి వేంకటేశ్వర స్వామి

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు.. ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు తెలిపారు. గోదావరి జలాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 9, 10, 11 తేదీల్లో గురుడ, హంస, సింహ వాహన సేవలను, 12 గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ.. సినిమా టికెట్ల ధరలు పెంచితే కఠిన చర్యలే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.