ETV Bharat / state

కాలువలో స్నానానికి దిగి ఇద్దరు మహిళలు మృతి

author img

By

Published : Jun 24, 2021, 12:23 PM IST

two women died
two women died

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో విషాదం నెలకొంది. ఏలేరు కాలువలో స్నానానికి దిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంఎర్రవరం వద్ద ఏలేరు కాలువలో స్నానానికి దిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు పెద్దాపురం గ్రామానికి చెందిన సూర్యకుమారి, లక్ష్మిలుగా గుర్తించారు. ఏలేరు కాలువలోకి దిగి... స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం అధికారులు,స్థానికులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఇరు వర్గాల మధ్య ఘర్షణ... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.