తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వరకు మూడో విడత పోలింగ్ కొనసాగనుంది.
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లంతా ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు. రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్, ఏఎస్పీ బిందు మాధవ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.