ETV Bharat / state

కొవిడ్​ రోగులకు సహృదయ ఫౌండేషన్ ఆహారం పంపిణీ

author img

By

Published : May 23, 2021, 7:44 PM IST

p gannavarm
పి గన్నవరంలో సహృదయ ఫౌండేషన్ ఉచిత సేవ

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని సహృదయ ఫౌండేషన్​ హోమ్ ఐసోలేషన్​లోని పేద రోగులకు ఆహారాన్ని అందిస్తోంది. మరికొంతమంది దాతలు సహాయం చేయాలని సంస్థ నిర్వహకులు కోరారు.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని సహృదయ ఫౌండేషన్ హోమ్ ఐసోలేషన్​లో ఉన్న పేద కొవిడ్ రోగులకు ఆహారం పంపిణీ చేస్తోంది. పి గన్నవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 66 మంది రోగులకు రెండు పూటల ఆహార పొట్లాలు తీసుకెళ్లి వారికి అందజేస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పైడి రాజేష్ తెలిపారు.

ఆహార పొట్లాలు పంపిణీ చేయడంలో తమకు కొందరు దాతలు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి.

100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.