ETV Bharat / state

'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన'

author img

By

Published : Nov 7, 2020, 5:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్రను నిర్వహించారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా.. సీఎం జగన్ పాలన సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

mla kondeti chitti babu in jagananna padayatra
పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టిబాబు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతోందని.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఉడుముడిలో నిర్వహించిన జగనన్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డప్పు కొట్టి పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఇదీ చదవండి: మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.