ETV Bharat / state

తుని పురపాలక సంఘం తొలి సమావేశం

author img

By

Published : Mar 28, 2021, 7:42 PM IST

పురపాలక సమావేశంలో మాట్లాడుతున్న చైర్​పర్సన్ సుధారాణి
పురపాలక సమావేశంలో మాట్లాడుతున్న చైర్​పర్సన్ సుధారాణి

తూర్పుగోదావరి జిల్లా పురపాలక సంఘం తొలి సమావేశం జరిగింది. సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ప్రస్తావించారు.

తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం నూతన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయా వార్డుల కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దామని ఛైర్​పర్సన్ హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులు, అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.