ETV Bharat / state

'తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి'

author img

By

Published : Apr 13, 2020, 7:51 PM IST

p gannavaram mla review on drinking water
తాగునీటిపై పి గన్నవరం ఎమ్మెల్యే సమీక్ష

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమీక్ష నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అధికారులకు స్పష్టం చేశారు. పి గన్నవరం ఎంపీపీ కార్యాలయంలో ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా, అవసరమైన చోట్ల ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: కోవిడ్‌-19 ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌, కరోనా ప్రత్యేకాధికారి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.