ETV Bharat / state

చాగల్నాడు ఎత్తిపోతల ప్రారంభం

author img

By

Published : Sep 23, 2020, 8:43 AM IST

MLA Jakkampudi Raja started to the Chagalnadu Upliftment project
చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చాగల్నాడు ఎత్తిపోతలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందుతోందని తెలిపారు.

చాగల్నాడు ఎత్తిపోతల పథకంలో.. స్టేజి 3లో భాగంగా రెండు పంపుసెట్లు ప్రారంభించారు. రాజానగరం మండలంలో సాగు, తాగు నీరు అందించేందుకు.. పాలచర్ల గ్రామ పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మించారు. శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.. వీటిని ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నార కాలంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి.. ఆయా పథకాలు మోటర్లు మరమ్మతులు పూర్తి చేసి.. సాగునీటిని విడుదల చేస్తోందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

తీరాన్ని ఆనుకొని ఉన్న సారవంతమైన భూములు నదిపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.