ETV Bharat / state

వరద బాధితులను ఆదుకుంటాం: మంత్రి పినిపే విశ్వరూప్

author img

By

Published : Aug 27, 2020, 10:30 AM IST

వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని ముంపు గ్రామాల్లో పర్యటించారు.

miniser pinipe vishwa roop visit flood efffected area at amalapuram
అమలాపురం రూరల్ మండలంలో మంత్రి పినిపే విశ్వరూప్

గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వ ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​తో కలిసి ఆయన అమలాపురం రూరల్ మండలంలో జలదిగ్బంధంలో ఉన్న గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందజేస్తామన్నారు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: పేలిన సిలిండర్​- త్రుటిలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.