ETV Bharat / state

గ్రామస్థుల ఫిర్యాదుతో దాడులు... వాహనాలు సీజ్

author img

By

Published : May 26, 2021, 8:09 PM IST

seize
వాహనాలు సీజ్

తూర్పుగోదావరి జిల్లా జగపతినగరం కొత్తచెరువులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దాడులు నిర్వహించి రెండు జేసీబీలు, లారీలను స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం కొత్తచెరువులో అక్రమ మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా చెరువు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి.. రెండు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

సెల్ఫీ వీడియో: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.