ETV Bharat / state

రోజూ 300లారీలు ₹30లక్షల దందా - అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 1:30 PM IST

Updated : Dec 15, 2023, 2:47 PM IST

Illegal_Sand_Mining_Mafia_in_AP
Illegal_Sand_Mining_Mafia_in_AP

Illegal Sand Mining Mafia in AP: ఏపీలో అధికారపార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ వందలాది లారీల్లో తరలిస్తున్నారు. అక్రమార్కులు గోదావరికి గుండె ఘోష మిగుల్చుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది.

రోజూ 300లారీలు ₹30లక్షల దందా - అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Illegal Sand Mining Mafia in AP: రాష్ట్రంలో ఇసుకాసురుల ఆగడాలు ఆగడంలేదు. అధికార పార్టీ అండదండలతో భారీ యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి రేయింబవళ్లూ తేడా లేకుండా వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.

డ్రెడ్జింగ్‌ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు - వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ

Sand Mining in East Godavari District: గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదని జాతీయ హరిత ట్రైబున్యల్ స్పష్టంగా చెప్పినా ఎక్కడా అమలుకావటం లేదు. పైగా రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరపడం లేదని న్యాయస్థానానికి అడ్వొకేట్ జనరల్‌ కూడా తెలిపారు. అయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇసుక దందా ఆగడం లేదు. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. గోదావరి గర్భంలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తూ రేయింబవళ్లు వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారు.

Illegal Sand Mining Mafia in Konaseema District: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరుగుతున్నాయి. ఊబలంక రేవులో ఈ నెల 1వ తేదీ నుంచి ఆరు భారీ యంత్రాలతో తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు సుమారు 300 వరకు లారీలపై ఇసుకను ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం వైపు తరలిస్తున్నారు. రోజుకు 30 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.

Illegal Soil Mining: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. గుల్లవుతున్న వెంకన్న కొండ

ఈ నిర్వహణ అంతా అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్నా డబ్బులు ఎవరి చేతుల్లోకి చేరుతున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నదీ పరిరక్షణ చట్టం(River Conservation Act) ప్రకారం ఉపరితలానికి గరిష్టంగా మీటరుకు మించి తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఊబలంకలో నదీగర్భంలో నిత్యం ఆరు భారీ యంత్రాలతో 20 నుంచి 30 అడుగుల లోతుతో ఇసుకను తవ్వేస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. దిగువ నుంచి నీరు ఊరుతోందంటే ఎంత లోతులో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

రీచ్‌లో అనుమతులు ఉంటే ఏ పరిధిలో తవ్వకాలు చేయాలి? ఎన్ని క్యూబిక్ మీటర్ల వరకు తరలించాలనే అంశాలను నిర్ధారిస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో జెండాలు పాతుతారు. ఇక్కడ అదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా నచ్చిన చోట తవ్వకాలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇసుక తవ్వకాలకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పదం ముగిసినా జేపీ వెంచర్స్‌ (JP Ventures) పేరిట బిల్లులు ఇస్తూ దందా కొనసాగిస్తున్నారు. అక్రమార్కులు గోదావరికి గుండె ఘోష మిగుల్చుతున్నా అడ్డుకోవాల్సిన గనులశాఖ, జలవనరులు, రెవెన్యూ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న వినిపిస్తోంది.

Sand Mining Mafia: అక్రమార్కులకు అడ్డేదీ..? రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

Last Updated :Dec 15, 2023, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.