ETV Bharat / state

వరద ముంపులో కోనసీమ

author img

By

Published : Aug 18, 2020, 6:11 PM IST

Updated : Aug 18, 2020, 8:45 PM IST

గోదావరి వరద విశ్వరూపం దాల్చింది. వరదల వల్ల కోనసీమలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు బతుడు జీవుడా అంటూ కట్టుబట్టలతో గట్టుకు చేరుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయని స్థానికులు చెప్పారు.

వరద ముంపులో కోనసీమ
వరద ముంపులో కోనసీమ

వరద ముంపులో కోనసీమ

తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 16 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గురజాపులంక, లంక ఆఫ్‌ ఠానేలంక, అయినాపురం గ్రామాలను వరదనీరు చుట్టేసింది.

బొప్పాయి, అరటి, వంగ, మునగ, బెండ, బీర తోటలు పూర్తిగా నీట మునిగాయి. లంకలో ఉండే పశువులను అతి కష్టంమీద గట్టుకు తరలిస్తున్నారు. వరద నీటితో లంకభూములన్నీ చెరువులుగా మారిపోగా.. రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

కాటన్​ బ్యారేజి వద్ద తగ్గని వరద ఉద్ధృతి

Last Updated : Aug 18, 2020, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.