ప్రవాస భారతీయులకు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. చిన్నారులు..పల్లె జనంతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. ప్రవాస భారతీయులు సందడిగా గడిపారు. మయన్మార్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, గయానా, ఫీజీ, దేశాల నుంచి 40 మంది విదేశీయులు ఈ గ్రామానికి వచ్చారు. వారంతా భోగి మంటలు వెలిగించి ఆనందంగా గిరిజనులతో నృత్యం చేశారు. విదేశీ ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొనడం.. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించటం సంతోషకరమని ఎంపీ భరత్ అన్నారు.
కోలాటాలు.. కోడిపందేలను విదేశీయులు ఆసక్తిగా తిలకించారు. తమ మిత్రులతో కలిసి సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. ఆటపాటలతో ప్రవాస భారతీయులు, విదేశీయులు ఉల్లాసంగా గడిపారు. ఎంపీ భరత్.. విదేశీ ప్రతినిధులకు కోనసీమ పిండివంటలను రుచిచూపించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తీ భోజనాలు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విదేశీ ప్రతినిధులు అన్నారు. తమ మిత్రులతో కలిసి ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మరపురాని అనుభూతి అని తెలిపారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశీయులు.. పొట్టిలంక గ్రామ ప్రజల ఆతిథ్యానికి మంత్రముగ్థులయ్యారు. కోనసీమ అందాలు తిలకిస్తూ... సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.
ఇదీ చదవండి :